సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇస్తా సిటీ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లాట్ నెంబర్ ఐదు వందల ఒకటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్ మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
చదవండి: (నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..)