జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. భయం గుప్పిట్లో అపార్ట్‌మెంట్‌ వాసులు

16 Mar, 2023 20:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోపల్లె ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ పరిశ్రమ మూతపడి ఉన్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే.. గురువారం నాటి పేలుడు ధాటికి పరిశ్రమలో ఒక్కొక్కటిగా సాల్వెంట్‌ డ్రమ్‌లు పేలిపోతున్నాయి. ఆ శబ్ధాల ధాటికి పక్కనే ఉ‍న్న అపార్ట్‌మెంట్‌ వాసులు భయపడిపోతున్నారు. ఘటనా స్థలానికి కాస్త ఆలస్యంగా చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. మంటలు ఆర్పే పనిలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు