ఐదు నెలల పసిబిడ్డకు కరోనా 

10 Jun, 2021 14:51 IST|Sakshi

సాక్షి, నారాయణఖేడ్‌: ఐదు నెలల పసికందుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం 28 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్‌ వచి్చనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ముగ్గురిలో అయిదు నెలల పాప సైతం ఉంది. కరోనా థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.  

మరిన్ని వార్తలు