ఒకే ఇంట్లో నలుగురి అనుమానాస్పద మృతి

14 Aug, 2020 10:41 IST|Sakshi

సాక్షి, వనపర్తి జిల్లా: ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉన్న మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి ఆవరణలో కుంకుమ,పసుపు, అగరబత్తీలు, నిమ్మకాయలు పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు