Adilabad: వందకు అరలీటర్‌  తక్కువగా పెట్రోల్‌..

19 Oct, 2021 08:46 IST|Sakshi
బాటిల్‌లో అరలీటర్‌ తక్కువగా వచ్చిన పెట్రోల్‌

సాక్షి, జన్నారం(ఆదిలాబాద్‌): మండల కేంద్రంలోని ఓపెట్రోల్‌ బంక్‌లో సోమవారం కృష్ణ అనే యువకుడు పెట్రోల్‌ను బాటిల్‌లో పోయించుకున్నాడు. బాటిల్‌లో రూ.వందకు అరలీటర్‌కు తక్కువగానే రావడంతో, పెట్రోల్‌ పోసిన వ్యక్తిని నిలదీశాడు. తర్వాత ఆ పెట్రోల్‌ను వేరే బాటిల్‌లో పోసి, మరోసారి పోయగా సుమారుగా లీటర్‌ వరకు వచ్చింది.

ఇప్పుడు ఎలా సరిగ్గా పోశారని, ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని ఆ యువకుడు నిలదీశాడు. అదే నేరుగా బండిలో పోసుకుంటే దూరం వెళ్లే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విషయంపై పెట్రోల్‌ బంక్‌ యజమాని ప్రేంసాగర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మిషన్‌లోని పైపు లీకేజీ, టెక్నికల్‌ సమస్య వల్ల ఇబ్బంది ఏర్పడిందని, మరమ్మతు చేసే వరకు ఆ మిషన్‌ను పక్కన పెట్టి, మరో మిషన్‌తో పెట్రోల్‌ పోయిస్తున్నామని  చెప్పారు.  

చదవండి: సికింద్రాబాద్‌ కేంద్రంగా కాల్‌ సెంటర్‌ స్కామ్‌

     

>
మరిన్ని వార్తలు