కోవిడ్‌ బాధితులకు ఆహారం ఫ్రీ.. ఎ​క్కడంటే..

23 Apr, 2021 17:32 IST|Sakshi

సాక్షి, కూకట్‌పల్లి: కోవిడ్‌ బారిన పడి వంట చేసుకోలేని వారికి యోగా విజ్ఞాన కేంద్రం  ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నట్లు అన్నపూర్ణేశ్వరి దేవి యోగా గురూజీ జగన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా బారిన పడిన వారికి ఇంటి వద్దకే నేరుగా భోజనం, ఆహార పానీయాలు అందజేయనున్నట్లు తెలిపారు.

ఏవరికైతే తమ సేవలు కావాలో ముందస్తుగా ఫోన్‌చేసి పేరు, చిరునామా లొకేషన్‌ పెడితే అన్నం ఇతర పదార్థాలు అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌: 9441887766 ఈ నెంబరుకు కాల్‌ చేయాలని నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు.

మరిన్ని వార్తలు