Telangana: మే 8న అమ్మలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం

7 May, 2022 14:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని మే 8న ఆర్టీసీలోని అన్ని కేటగిరీ బస్సుల్లో అమ్మలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఐదేళ్ల లోపు చిన్నారులతో ప్రయాణించే మాతృమూర్తులందరికీ ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పల్లెవెలుగు మొదలు ఏసీ సర్వీసుల వరకు ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు