Telangana: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నగరాల్లో సెలవు

9 Sep, 2022 02:28 IST|Sakshi

10న రెండో శనివారం పనిరోజు 

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 9న శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. 9న సెలవు తీసుకుంటున్నందున ఈ నెల 10న రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.    

మరిన్ని వార్తలు