నాలాల అభివృద్ధిపై జెడ్‌సీ సమీక్ష

21 Feb, 2022 06:41 IST|Sakshi
సమీక్షలో పాల్గొన్న ఖైరతాబాద్‌ జెడ్‌సీ రవికిరణ్‌   

బంజారాహిల్స్‌: వర్షాకాలం ప్రారంభం అయ్యేలోగా నాలాల రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌ సూచించారు. ఆదివారం జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో ఆయన సంబంధిత ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎన్‌డీపీ కింద చేపట్టిన నాలాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి అన్నదానిపై సంబంధిత ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు.

సమీక్షలో పాల్గొన్న ఖైరతాబాద్‌ జెడ్‌సీ రవికిరణ్‌   

మరిన్ని వార్తలు