ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకిన యువతి..

5 Apr, 2022 22:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ విఫలమైందని ఓ యువతి ఈఎస్‌ఐ మెట్రోస్టేషన్‌ పైనుంచి కిందకు దూకింది. మెట్రోస్టేషన్‌ నుంచి దూకడంతో తీవ్రగాయాలైన ఆ యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలను కోల్పోయింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్‌కు చెందిన  యువతిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

చదవండి: కూతురి ఉసురు తీసిన తండ్రి.. అదృశ్యమైందంటూ..

మరిన్ని వార్తలు