రామోజీ ఫిల్మ్‌సిటీపై దర్యాప్తు చేయించండి

12 Jul, 2021 03:48 IST|Sakshi
గోనె ప్రకాశ్‌రావు

సీఎం కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: అసైన్డ్‌ భూముల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం, ప్రభుత్వ రహదారి ఆక్రమణ, పేదలకు కేటాయించిన భూముల్లోకి వారిని అనుమతించకపోవడంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం అక్రమాలపై గత పదేళ్లుగా పోరాటం చేస్తున్న తాను, దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఈ అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని తెలిపారు. నిరూపించలేకపోతే దేశం విడిచి శాశ్వతంగా వెళ్లిపోతానని సవాల్‌ చేశారు. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేస్తే సమస్య లు వస్తాయనే ఉద్దేశంతో స్థానిక రైతుల నుంచి ఆ భూములను 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు రాయించుకుని.. అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం మోసగిస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు