ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి: గవర్నర్‌

17 Aug, 2022 02:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి, ప్రాణదాతలు కా­వా­లని గవర్నర్‌ తమిళిసై సౌందరరా­జన్‌ పిలుపునిచ్చారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో నాలుగు మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వ్యాన్లను మంగళవారం ఆమె రాజ్‌భ­వన్‌లో ప్రారంభించారు. ఈ మొబైల్‌ బ్లడ్‌ కలెక్షన్‌ వ్యాన్లు బ్లడ్‌ డోనర్‌ వద్దకే వెళ్లి రక్తాన్ని సేకరించడానికి ఎంతగానో ఉపయోగప­డతా యని, దాతలు కూడా ముందుకు వస్తా­రని తెలిపారు.

ఈ నాలుగు మొబైల్‌ బ్లడ్‌ కలె­క్షన్‌ వ్యాన్లను హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌ ప్రతిని«­దులకు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ అజయ్‌మిశ్రా పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు