మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు : గవర్నర్‌  

18 Feb, 2023 00:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. జాగారం రూపంలో మేల్కొని ఉంచే మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు అని పేర్కొన్నారు. మహాశివరాత్రి కోట్లాది మంది శివుడి భక్తులకు ఆరాధ్యమైన పర్వదినమని తెలిపారు.

ఈ పర్వదినం సందర్భంగా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావాన్ని పెంపొందించాలని గవర్నర్‌ ప్రార్థించారు.   కాగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న తమిళిసైని పుదుచ్చేరి సీఎం రంగస్వామి సత్కరించారు.   

మరిన్ని వార్తలు