Republic Day 2023: రాజ్‌భవన్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు.. అక్కడే బలగాల పరేడ్‌

25 Jan, 2023 19:36 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గణతంత్ర దినోత్సవ వేడుకలపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. రేపు(గురువారం) రాజ్‌భవన్‌లో రిపబ్లిక్‌ వేడుకలను నిర్వహించనున్నట్టు ఓ ప్రకటన విడులైంది. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 

వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై గురువారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లోనే బలగాలు పరేడ్‌ నిర్వహించనున్నారు. అలాగే, రేపు ఉదయం 6:30 గంటలకు బీఆర్‌కే భవన్‌లో గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌ శాంతికుమారి.. జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 

మరిన్ని వార్తలు