Hyderabad: కోమటిరెడ్డి కంపెనీ కార్యాలయాల్లో సోదాలు

14 Nov, 2022 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుశి ఇన్‌ఫ్రాలో జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్​‍-12లో కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లో పలు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. సుశి ఇన్‌ఫ్రాకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనయుడు సంకీర్త్‌ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు