నాకు ఎలాంటి ఈడీ నోటీసులు రాలేదు: కవిత

17 Sep, 2022 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం వ్యవహారంలో తనకు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వస్తున్న వార్త ల్లో నిజం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో వివరాలను వెల్లడించారు. కొందరు ఢిల్లీలో కూర్చుని తనపై తప్పుడు ప్రచా రం చేస్తున్నారని ఆరోపించారు.

తనకు ఏ దర్యాప్తు సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. మీడియా వాస్తవాలను చూపించడానికి సమయం వెచ్చించాలని కోరారు. కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ట్వీట్‌ చేస్తున్నట్టు తెలిపారు.   

మరిన్ని వార్తలు