సాక్షి, వరంగల్: ఒక్కసారిగా ముంచెత్తిన వానకు నగరం విలవిల్లాడిపోయింది. లోతట్టు ప్రాంతాలు,శివారు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఎత్తిపోస్తూ కనిపించారు. ప్రధాన రహదారులకు తోడు కాలనీల్లోని అంతర్గత రోడ్లపైకి కూడా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ ముందుకు సాగారు.