High Court: మండపాల వద్ద జనం గుమిగూడకుండా చూడాలి

11 Aug, 2021 17:14 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాగా, వినాయక చవితి ఉత్సవాల్లో జనం ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే విధంగా.. వీలైనంత త్వరగా మండపాల వద్ద పాటించాల్సిన ఆంక్షలు, మార్గదర్శకాలను ప్రజలకు తెలియజేయాలని తెలిపింది.

థర్డ్‌వేవ్‌ ప్రభావం నేపథ్యంలో... వైరస్‌ను ఎదుర్కొనేందుకు కచ్ఛితమైన ప్రణాళిక రూపొందించాలని  తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్‌ 8కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

మరిన్ని వార్తలు