ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సిట్‌ నోటీసులపై హైకోర్టు స్టే

5 Dec, 2022 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ నేత  బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు జగ్గుస్వామికి  హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) జారీ చేసిన 41 ఏ సీఆర్‌పీసీ  నోటీసులపై స్టే విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

వాదనలు విన్న ధర్మాసనం  ఈనెల 13వ తేదీ వరుకు సిట్‌ నోటీసులపై స్టే విధించింది.  తదుపరి విచారణ చేసే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
చదవండి: మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు