అతి తెలివి అంటే ఇదే.. ఇళ్లంతా ఐరన్‌తోనే నిర్మాణం 

21 Apr, 2021 14:28 IST|Sakshi
ఆర్టీసీకాలనీలో ఐరన్‌తో చేపట్టిన నిర్మాణం  

సాక్షి, సైదాబాద్‌: అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే కూల్చేస్తారని అతి తెలివితో ఓ వ్యక్తి ఐరన్‌తో నిర్మాణం చేపట్టాడు. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ ఆర్టీసీకాలనీలో ప్రధాన రహదారికి ఆనుకొని ఐరన్‌తో జీ–ప్లస్‌ వన్‌ను నిర్మించాడు. శ్లాబు, గోడలు, మెట్లు అంతా ఐరన్‌తోనే నిర్మించడం గమనార్హం. కింది భాగంలో నాలుగు షెట్టర్లను ఏర్పాటు చేశాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చామని టౌన్‌ప్లానింగ్‌ అధికారి మల్లీశ్వర్‌ తెలిపారు. స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు