Hyderabad: బాలికపై సామూహిక అత్యాచారం.. స్పందించిన కేటీఆర్‌

4 Jun, 2022 02:56 IST|Sakshi

బాలికపై అత్యాచారం ఘటనపై మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరంలో మైనర్‌ బాలికపై అత్యాచారం వార్త విని షాక్‌కు గురయ్యానని, తీవ్ర ఆగ్రహం కలిగిందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ సంఘటనలో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారు ఎంత హోదాలో ఉన్నా, ఎలాంటివారితో అనుబంధమున్నా క్షమించరాదని స్పష్టం చేశారు.

కఠిన చర్యలు తీసుకుంటాం...
కేటీఆర్‌ ట్వీట్‌కు హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. ఈ సంఘటన దారుణమైనదని, దీనికి పాల్పడిన వారు ఎంతటి వారైనా, ఎంత బలమైన వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని రీట్వీట్‌ చేశారు. వారిని త్వరగా అరెస్టు చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఇప్పటికే డీజీపీని, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు