విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా

3 Dec, 2021 17:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ భారత్‌లో ప్రవేశించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకే, సింగపూర్‌, కెనడా నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారందరని ఐసోలేషన్‌లో ఉంచారు.
(చదవండి: వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్‌.. లైట్‌ తీసుకోవద్దు ప్లీజ్‌!)

భారత్‌లో ఒమిక్రాన్‌ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌తో నవంబర్‌ 20న బెంగళూరుకి చేరుకున్నారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా విమానాశ్రయంలో నిర్వహించిన కోవిడ్‌–19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌కి వెళ్లారు. వారం రోజుల తర్వాత ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న ఆయన కరోనా నెగెటివ్‌ రావడంతో దుబాయ్‌కి వెళ్లిపోయారు. ఆయన నుంచి సేకరించిన నమూనాలను ఇన్సాకాగ్‌ నెట్‌వర్క్‌కి పంపి జన్యుక్రమాన్ని విశ్లేషించగా అతనికి సోకింది ఒమిక్రాన్‌ వేరియెంట్‌ అని నిర్ధారణైంది.
(చదవండి: ఒమిక్రాన్‌ వచ్చేసింది.. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ..)

ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన రెండో వ్యక్తి బెంగుళూరుకి చెందిన డాక్టర్‌. రెండు డోసులు పూర్తి అయిన ఆయన ఈ మధ్య కాలంలో ఇతర ప్రాంతాలకి కూడా ప్రయాణించలేదు. జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో నవంబర్‌ 21న కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ మర్నాడే అతను ఆస్పత్రిలో చేరారు. మూడు రోజలు తర్వాత డిశ్చార్జ్‌ అయి వెళ్లిపోయారు.

చదవండి: కరోనా నియంత్రణలో ఘోర వైఫల్యం

మరిన్ని వార్తలు