Lizard In Ordered Biryani: చికెన్‌ బిర్యానీలో బల్లి.. కంగుతున్న కార్పొరేటర్‌

27 May, 2022 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసలే ఆకలి. అందునా ఆర్డర్‌చేసిన చికెన్‌ బిర్యానీ రానే వచ్చింది. ఇంకేముంది! ఒక పట్టుపట్టడమే అనుకున్నాడా వ్యక్తి. కానీ, ఆబగా సగం బిర్యానీ తిన్న తర్వాత పగవాడికీ రాని పరిస్థితి అతనికి తలెత్తింది. బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది. యాక్‌! అనుకుంటూ తిన్న బిర్యానీ వాంతి చేసుకున్నాడు. ఇది ఎక్కడో ఏ మారుమూలో జరగలేదు. మన హైదరాబాద్‌లో.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో శుక్రవారం వెలుగుచూసిందీ ఘటన.

వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఓ ‍ప్రముఖ రెస్టారెంట్‌ నుంచి తెచ్చుకున్న చికెన్‌ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది. రాంనాగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ రెస్టారెంట్‌ నుంచి బిర్యానీ ఆర్డర్‌ చేశాడు. సగం బిర్యానీ తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్‌ అయ్యాడు. దీంతో కంగుతిన్న కార్పొరేటర్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. అదే విధంగా ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌ బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు.


చదవండి: వికారాబాద్‌: పెళ్లయిన 20 రోజులకే.. 

మరిన్ని వార్తలు