కార్ల స్క్రాప్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం 

8 Feb, 2023 02:33 IST|Sakshi
అగ్నికి అహుతైన  కార్ల స్క్రాప్‌ దుకాణం

మైలార్‌దేవ్‌పల్లి:  కార్ల స్క్రాప్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టాటానగర్‌ ప్రాంతంలో  షేక్‌ వాహిద్‌(50) అనుమతి లేని కార్ల స్క్రాప్‌ గోదాములను నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం షాట్‌సర్క్యూట్‌ కారణంగా  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో గోదాములో ఉన్న కార్లు, వాటి పరికరాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

మరిన్ని వార్తలు