Hyderabad: హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం

15 Aug, 2022 19:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులో కాల్పులు కలకలం సృష్టించాయి. రాచకొండ మీర్ఖంపేట గెస్ట్‌హౌస్‌లో కందుకూరు మండల టీఆర్‌ఎస్‌ నాయకుడు విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రమ్‌ గన్‌తో కాల్పులు జరిపారు. జన్మదిన వేడుకల్లో ఈ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. నిందితులు వాడిన ఎయిర్‌గన్‌ నిజమైనదా?.. కాదా అని తెలియాల్సి ఉంది. స్థానిక నేత రవీందర్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకలకు బడా నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. ఘటనపై యాచారం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

చదవండి: (ఆనాడు ఆస్తులెన్ని.. ఇప్పుడెన్ని?.. మొత్తం బయటకు తీస్తా: కోమటిరెడ్డి)

మరిన్ని వార్తలు