జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో డ్రైవ్ చేసిన యువతులు!

29 Jan, 2023 08:20 IST|Sakshi

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌  చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్లి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న యువతులు కారు నడిపినట్లు తెలుస్తోంది. తాగి రోడ్డుపై షికారు చేస్తూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినట్లు సమాచారం.

ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్రగాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కారు నడిపిన వారిని విచారిస్తున్నారు.
చదవండి: ఒక మర్రితో  మరిన్ని..! చేవెళ్ల రోడ్డు విస్తరణతో  760 మర్రి చెట్లకు గండం

మరిన్ని వార్తలు