Hyderabad Metro: నేటినుంచి రాత్రి 11.15 గంటల వరకు మెట్రో

6 Sep, 2021 08:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో సేవలు సోమవారం నుంచి ఉదయం 7 నుంచి రాత్రి 11.15 గంటల వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో నిర్మాణ, నిర్వహణ సంస్థ ఎల్‌అండ్‌టీ తెలిపింది. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 10.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు చివరి గమ్యస్థానం చేరుకుంటుందని ప్రకటించింది. కోవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం మెట్రో స్టేషన్లు, రైళ్లను శానిటైజేషన్‌ చేస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు