HYD: రేసింగ్‌ లీగ్‌ ఎఫ్టెక్‌.. ఎన్టీఆర్‌ మార్గ్‌ మూసివేత

18 Nov, 2022 10:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ తీరం ఉత్కంఠభరితమైన రేసింగ్‌ లీగ్‌కు సిద్ధమైంది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు జరుగనున్నాయి. దీంతో, నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.

ఈ నేపథ్యంలో శుక్రవారం 11 గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌ను పూర్తిగా మూసివేయనున్నట్టు  ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. కాగా, రేసింగ్‌ పోటీలు జరుగనున్న నేపథ్యంలో ట్రాక్ పనులు చేసేందుకు శుక్రవారం నుంచే పనులు ప్రారంభమయ్యాయి. ట్రాక్‌ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు రోడ్డును మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వాహనదారులు ఎన్టీఆర్ మార్గ్ కాకుండా వేరే మార్గాల నుండి వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. 
 

మరిన్ని వార్తలు