ఈ నెల 3న రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బస

1 Jul, 2022 15:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 3న రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బస చేయనున్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ సభ తర్వాత రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేయనున్నట్లు నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. రాజ్‌భవన్‌లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.
చదవండి: మోదీ పర్యటన ఇలా.. షెడ్యూల్‌ ఇదే

హెచ్‌ఐసీసీ, బేగంపేట, రాజ్‌భవన్‌ మార్గాల్లో 4వేల మంది, పేరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్‌లో భద్రత ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమావేశాలకు హాజరవుతున్నారు.

మరిన్ని వార్తలు