డుగ్గు డుగ్గుమంటూ .. ‘బుల్లెట్‌’ బైక్‌ ఎక్కి పోదామా!

30 May, 2022 21:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా అనంతరం బైక్‌ రైడింగ్‌ ఈవెంట్స్‌ తిరిగి రోడ్డెక్కుతున్నాయి. నగరానికి చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ రైడర్స్‌ ఇష్టపడే బైక్‌ టూర్‌ మూడేళ్ల తర్వాత మరోసారి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హిమాలయన్‌ ఒడిస్సీ పేరుతో నిర్వహించే ఈ బైక్‌ టూర్‌...ప్రపంచంలోని అతి పెద్ద రైడ్స్‌లో ఒకటిగా పేరొందింది.

ఈ ఏడాది జులై 2న ఢిల్లీలో పునఃప్రారంభం కానున్న ఈ అడ్వంచరస్‌ రైడ్‌ 18 రోజుల పాటు హిమాలయ పర్వత ప్రాంతంలో కొనసాగుతుందని, మొత్తం 2,700 కి.మీ దూరం పాటు రైడ్‌ ఉంటుందని వివరించారు.

చదవండి: Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు

మరిన్ని వార్తలు