సీఆర్‌ ఫౌండేషన్‌కు ఎస్‌బీఐ వాహనం 

9 Jul, 2022 01:03 IST|Sakshi

సీఎస్‌ఆర్‌ కింద అందజేసిన ఎండీ విశ్వనాథన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బలహీన వర్గాలను ఆదుకోవడంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందువరుసలో ఉంటుందని ఆ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్వామినాథన్‌ జానకిరామన్‌ అన్నారు. అవసరమైనవారికి వివిధ రూపాల్లో ఎస్‌బీఐ కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) ద్వారా సాయం అందిస్తోందని తెలిపారు. కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌కు మారుతీ ఈకో ఏడు సీట్ల వ్యాన్‌ను శుక్రవారం అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్‌ వ్యక్తిగా సామాజికసేవ కార్యక్రమంలో పాల్గొనడం సంతృప్తి కలిగిస్తోందన్నారు. బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో 75 వేల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు స్వామినాథన్‌ జానకిరామన్‌ తెలిపారు. బ్యాంక్‌ సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలు, సామాజిక సంక్షేమంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలతో బలహీనవర్గాలను ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ ఫణీంద్రనాథ్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు