హైదరాబాద్‌-యూఏఈకి మరిన్ని విమాన సర్వీసులు  

13 Sep, 2020 11:38 IST|Sakshi

సాక్షి, శంషాబాద్‌: భారత్‌–యూఏఈ మధ్య కుదిరిన ట్రాన్స్‌పోర్టబుల్‌ ఒప్పందం మేరకు ఇప్పటికే శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు ప్రారంభించింది. వారంలో మూడు రోజులు కొనసాగుతున్న ఈ సర్వీసులకు తోడుగా తాజాగా ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా దుబాయ్‌కు సర్వీసులు ప్రారంభించింది. సోమ, బుధ, శనివారాల్లో ఈ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఇక హైదరాబాద్‌–షార్జాకు మధ్య ఎయిర్‌ అరేబియా ఎయిర్‌లైన్స్‌ వారంలో మూడు సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులు బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉంటాయని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. కరోనా నిబంధనల మేరకు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని తెలిపాయి.

మరిన్ని వార్తలు