Hyderabad: భర్తతో గొడవపడి.. భార్య అదృశ్యం

6 Jan, 2023 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భర్తతో గొడవపడి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గురువారం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... హయత్‌నగర్‌ డివిజన్‌ సూర్యానగర్‌లో నివసించే మహీంద్రారెడ్డి ప్రైవేటు ఉద్యోగి. ఆయన భార్య శిరీష(25) బుధవారం రాత్రి గుర్తు తెలియని వారితో ఫోన్‌లో చాటింగ్‌ చేస్తుంది.

ఈ విషయమై భర్త ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శిరీషపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మహీంద్రారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్‌ విసిరి.. పోలీసులకు చిక్కాడు


 

మరిన్ని వార్తలు