శ్రీశైలం పవర్‌ హౌస్‌ ప్రమాదంపై మరో కమిటీ

23 Aug, 2020 19:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనపై ఇప్పటికే సీఐడీ అడిషనల్‌ డీజీ గోవింద్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం విచారణ ఆరంభించగా, తాజాగా మరో కమిటీని నియమించారు. టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎండీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలో శ్రీనివాసరావు(జేఎండీ), జగత్‌రెడ్డి(ట్రాన్స్‌మిషన్‌ డైరెక్టర్‌), సచ్చిదానందం(టీఎస్‌ జెన్‌కో ప్రాజెక్టు డైరెక్టర్‌), రత్నాకర్‌(కన్వీనర్‌)లు సభ్యులుగా ఉన్నారు.( చదవండి: శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ)

మరిన్ని వార్తలు