జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు 

16 Dec, 2022 09:26 IST|Sakshi

జోగుళాంబ శక్తిపీఠం(మహబూబ్‌నగర్‌ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం అలంపూర్‌ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి అరుదైన గౌరవం లభించింది. హిందుస్తాన్‌ గగన్‌గౌరవ్‌ జ్యోతిర్లింగ ఫౌండేషన్‌లు వరల్డ్‌ హెల్త్‌ డయాబెటిక్, క్యాన్సర్, ఎయిడ్స్‌ ఫౌండేషన్‌ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని గాంధీభవన్‌లో సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సులో జోగుళాంబ ఆలయానికి ‘హిందుస్తాన్‌ గగన్‌గౌరవ్‌ అంతర్జాతీయ పురస్కారం–2022’ప్రకటించారు.

కోవిడ్‌ సమయంలో వచ్చిన తుంగభద్ర నదీ పుష్కరాలకు లక్షలాది మంది వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తకుండా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆలయ ఈఓ పురేందర్, ప్రధాన అర్చకుడు ఆనంద్‌ శర్మ, వేదపండితులు శ్యాంకుమార్‌ శర్మలను ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి వారికి అవార్డును ప్రదానం చేశారు. 

మరిన్ని వార్తలు