పని ఒత్తిడి.. అందుకే కప్పు అల్లం టీ: ఎమ్మెల్సీ కవిత

15 Dec, 2020 14:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉదయం ఓ కప్పు టీ కడుపున పడితేనే రోజు ప్రారంభం అవుతోంది. సామాన్యుడి నుంచి ధనికుడిని సైతం ఉదయం లేవగానే ఆహ్లదపరిచే టీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి చాయ్‌కి గుర్తింపుగా డిసెంబర్‌ 15న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపకుంటున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీ తాగుతున్న సెల్ఫీ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

‘తీరిక లేకుండా పనితో అలసిపోయినప్పుడు మధ్యలో ఒక కప్పు వేడి వేడి అల్లం టీ తాగితే వచ్చే మజా కంటే మరింకేం ఉండదు. నేడు ఇంటర్నేషన్‌ టీ డే. ఈ సందర్భంగా అల్లం చాయ్‌ తాగుతున్న నా సెల్ఫీని మీతో పంచుకుంటున్న. అలాగే నా ఫాలోవర్స్‌ కూడా టీ తాగుతున్న మీ సెల్ఫీని నాతో పంచుకోండి’ అంటూ కవిత ట్వీట్‌ చేశారు. కవిత పిలుపు మేరకు ఆమె ట్విటర్‌ ఫాలోవర్స్‌ అంతా టీ తాగుతున్న సెల్ఫీ ఫొటోలను ఆమెతో షేర్‌ చేసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు