సాక్షి, మెదక్: మాజీ మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మెదక్ జిల్లా అచ్చంపేటలో భూసర్వే కొనసాగుతుంది. జమునా హేచరీస్కు సంబంధించిన భూములను సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, 130 సర్వే నెంబర్లో 18.20 ఎకరాల అసైన్డ్ భూమి సర్వే జరుగుతుంది. దీనిపై ఇప్పటికే 11 మంది రైతులకు నోటిసులు ఇచ్చినట్లు ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ తెలిపారు.