గ్రేటర్‌ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ జట్టు

22 Oct, 2020 09:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ స్నేహానికి రంగం సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని, 2023లో తెలంగాణలో పాగా వేస్తామని చెప్పుకుంటున్న బీజేపీ, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ గ్లామర్‌పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న జనసేన ఈ కొత్త స్నేహంలో భాగస్వాములు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఇందుకు వేదిక కానున్నాయని, ఈ మేరకు ఇరు పార్టీల మధ్య చర్చ లు దాదాపు పూర్తయి ఓ అవగాహనకు వచ్చాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఏపీలో కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణ లోనూ వీటి మైత్రిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

చదవండి: ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఉండవు

మరిన్ని వార్తలు