మెరిసిన ‘తెల్ల బంగారం.. క్వింటాల్‌ పత్తి ధర రూ.7,800 

23 Sep, 2021 08:16 IST|Sakshi

జమ్మికుంటలో క్వింటాల్‌పత్తి ధర రూ.7,800 

నారాయణపేట జిల్లాలో రూ.7,300

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తికి రికార్డు ధర పలికింది. పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు పోటీ పడ్డారు. నాణ్యంగా ఉన్న పత్తికి క్వింటాల్‌కు రూ.7,800 గరిష్ట ధర పలికింది. అలాగే కనిష్టంగా రూ.6,000 వరకు వేలం పాటలో రైతులకు చెల్లించారు.

నారాయణపేట జిల్లాలో కూడా మంచి ధర వచ్చింది. ఊట్కూర్‌ మండలం తిప్రాస్‌పల్లి సమీపంలోని విజయ్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌ నిర్వాహకులు నాణ్యతను బట్టి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,300 ధర చెల్లించారు. అలాగే కనిష్టంగా రూ.6,500 చెల్లించారు.     – జమ్మికుంట/నారాయణపేట 
 

మరిన్ని వార్తలు