ఎమ్మెల్యే సాయన్న మృతి.. కేసీఆర్‌, కిషన్‌రెడ్డి సహా పలువురి సంతాపం

19 Feb, 2023 15:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సహా, పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. 

- సాయన్న మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

- మంత్రి కేటీఆర్‌ కూడా సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణం చాలా బాదాకరమని అన్నారు. ఈ సందర్బంగా సాయన్న కుటుంబ సభ్యులకు కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

- మంత్రి తలసాని కూడా సాయన్న మృతికి సంతాపం తెలిపారు. 

- కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సాయన్న మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో​నే సాయన్న అందరితోనూ సౌమ్యంగా, ఆత్మీయంగా మాట్లాడేవారు.  వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు