కేరళ సీఎం విజయన్‌ హైదరాబాద్‌ రాక

29 Dec, 2022 03:46 IST|Sakshi
కేరళ సీఎం విజయన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, ఇతర నాయకులు 

నేడు ఖమ్మంలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల్లో పాల్గొననున్న విజయన్‌

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మం: ఖమ్మంలో గురువారం జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వ అతిథి గృహంలో సీపీఎం ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మూడో రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో గురువారం మొదలుకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళా శాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేరళ సీఎం పినరయి విజయన్‌  ప్రసంగిస్తారు. సభకు లక్ష మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు