ఖజానా జువెలర్స్‌ భారీ విరాళం

12 Sep, 2020 04:24 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందజేస్తున్న కిశోర్‌కుమార్‌. చిత్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు

మంత్రి కేటీఆర్‌కు రూ.3 కోట్ల చెక్కు అందజేత 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా జువెలర్స్‌ అండగా నిలిచింది. కరోనాను అంతమొందించేందుకు తనవంతుగా రూ. 3 కోట్లు అందించింది. ఆ చెక్కును హైదరాబాద్‌లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో ఖజానా జువెలర్స్‌ కిశోర్‌కుమార్‌ అందించారు. ఈ నిధిని కరోనా నిర్మూలన, కరోనా బాధితుల సంరక్షణలో భాగంగా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వినియోగించాలని కిశోర్‌కుమార్‌ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఖజానా జువెలర్స్‌ కిశోర్‌ కుమార్‌ను మంత్రులు అభినందించారు.

మరిన్ని వార్తలు