ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్యకు ప్రమాదం, ఎడమ కాలుకి గాయం

17 Mar, 2022 14:57 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రామయ్య ఏడమ కాలుకు తీవ్ర గాయమైంది. ఖమ్మం జిల్లాలో రెడ్డిపల్లిలోని బైపాస్ సమీపంలో మొక్కలను నీళ్లు పోయడానికి బైక్ పై వెళ్లుతు ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. రామయ్యను పరీక్షించిన వైద్యులు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ వైద్యుల మాటలు కూడా వినకుండా ఇబ్బందిపడుతునే మొక్కలను నీళ్లు పోయడానికి వెళుతున్నారు. అయితే తాను నాటిన మొక్కలకు నీళ్లు పోయకపోతే అవి చనిపోతాయని రామయ్య చెబుతున్నారు.


చదవండి: జీవో 111ను రద్దు వినాశనానికి దారితీస్తుంది: రాజేంద్రసింగ్‌

మరిన్ని వార్తలు