మల్లు స్వరాజ్యంను పరామర్శించిన కిషన్‌రెడ్డి 

5 Mar, 2022 02:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యంను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను వాకబు చేశారు. కిషన్‌రెడ్డితో పాటు నగరానికి చెందిన పలువురు బీజేపీ నేతలున్నారు. 

మరిన్ని వార్తలు