స్వచ్ఛత దినోత్సవంగా గాంధీ జయంతి 

15 Sep, 2020 03:28 IST|Sakshi

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో పారిశుధ్యానికి మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. స్వచ్ఛ పట్టణాల రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం అదనపు కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అక్టోబర్‌ 2 నాటికి పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రతి పట్టణంలో తడి పొడి చెత్త కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు