ఎన్టీఆర్‌కు మరణం ఉండదు: లక్ష్మీపార్వతి

18 Jan, 2022 10:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్టీఆర్‌కు మరణం ఉండదని లక్ష్మీపార్వతి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లోని సమాధి వద్ద లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ భౌతికంగా దూరమైనా అందరి మనసుల్లో ఉన్నారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించారని లక్ష్మీపార్వతి అన్నారు.


చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్‌..

మరిన్ని వార్తలు