పంట చేలకు కోతుల బెడదా? ఇలా చేయండి

23 Mar, 2021 08:20 IST|Sakshi
 పొలంలో ఏర్పాటు చేసిన కొండెంగ బొమ్మ

‘కొండెంగ బొమ్మ’ తో కోతులకు చెక్‌

సాక్షి, గంభీరావుపేట(సిరిసిల్ల): పొట్టదశకొచ్చిన వరి చేలను కోతులు పీల్చి పడేస్తున్నాయి. పొలం గట్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ వరి కంకులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా మళ్లీ మళ్లీ వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి.

ఈ క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన రాజబోయిన ఆంజనేయులు అనే యువ రైతు తన పొలంలో కొండెంగ బొమ్మను కాపలా పెట్టాడు. కొండెంగగా భావిస్తున్న కోతులు భయంతో అటు వైపు రావడం మానేశాయి. ఆంజనేయులు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. తమ పొలంలోనూ అలాగే ఏర్పాటు చేసుకుంటామంటున్నారు.
చదవండి: ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్‌వేర్‌ యువ జంట 

మరిన్ని వార్తలు