తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు

2 Jan, 2021 05:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సరాదిలో తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. గత నాలుగురోజుల్లో రూ.758.76 కోట్ల విలువైన లిక్కర్‌ వ్యాపారం జరిగింది. డిసెంబర్‌ 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ పేర్కొంది. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకలకు అనుమతి లేకున్నా.. గతేడాది పోలిస్తే ఈ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు అధికంగా ఆదాయం రావడం విశేషం. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయి. మొత్తంగా 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు