ఆపత్కాలంలో ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ సాటివారికి సహాయపడుతున్నారు. కరోనా బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు సిద్దిపేటకు చెందిన శశికర్నంద అనే యువకుడు బైక్ అంబులెన్స్ నడిపిస్తున్నాడు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్యం అందించలేమని కింగ్కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రి సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోనే బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ‘టౌటే’ తుపాను ధాటికి అరేబియా సముద్రంలో మునిగిపోయిన నౌక నుంచి పలువురిని కాపాడటంతో ‘బతుకు జీవుడా’ అంటూ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.