-
‘యాస్’ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కల్లోలం రేపింది. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ నష్టం మిగిల్చింది. ఖరీఫ్కు సిద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు సాగు చట్టాల వ్యతిరేక పోరాటానికి ఆరు నెలలు పూర్తి కావడంతో నల్ల జెండాలతో రైతు సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇక.. కరోన మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంక్షలు కొనసాగుతున్నాయి.